Asia Cup 2023: భారత్ vs పాక్ మ్యాచ్.. ఏసీసీ కీలక నిర్ణయం
ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్కు రిజర్వ్ డేను ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్.
దిశ, వెబ్డెస్క్: ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్కు రిజర్వ్ డేను ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. సెప్టెంబర్10న మ్యాచ్జరగనుండగా.. తర్వాతి రోజును రిజర్వ్ డేగా ప్రకటించింది. అయితే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆటకు ఏదైనా ఆంటంకం ఏర్పడితే సెప్టెంబర్11న ఆగిపోయిన సమయం నుంచి మ్యాచ్జరగనుంది. అయితే, టోర్నీలోని ఇతర సూపర్ ఫోర్మ్యాచ్లకు మాత్రం ఎలాంటి రిజర్వ్ డేను ప్రటించలేదు. టోర్నీ ఫైనల్కు మాత్రమే రిజర్వ్ డే ఉండగా.. తర్వాత భారత్, పాక్మ్యాచ్కు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిచింది. ఒకవేళ మ్యాచ్మధ్యలో ఆగిపోతే.. ప్రేక్షకలు తమ టికెట్లతో రిజర్వ్ డే మ్యాచ్కు రావొచ్చని చెప్పింది.
"ఆసియా కప్సూపర్ ఫోర్లో భాగంగా జరిగే భారత్, పాక్ మ్యాచ్కు రిజర్వ్ డేను ఏర్పాటు చేశాం. సెప్టెంబర్10న శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఏదైనా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ఆగిపోతే ఆ సమయం నుంచి సెప్టెంబర్ 11న తిరిగి మొదలవుతుంది" ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది.
గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాక్ మధ్య మ్యాచ్.. వర్షం కారణంగా రద్దు అయింది. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన సమయానికి జోరు వర్షం కురిసింది. ఆ తర్వాత చాలాసేపు వేచి చూసినప్పటికీ వర్షం తగ్గకపోవడం వల్ల చివరికి చేసేదేమి లేక పాక్ జట్టు బ్యాటింగ్కు దిగకుండానే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ మ్యాచ్ను చూద్దామనుకున్న వరల్డ్ క్రికెట్ఫ్యాన్స్కు తీవ్ర నిరాశే ఎదురైంది.