Asia Cup 2023: భారత్ vs పాక్ మ్యాచ్.. ఏసీసీ కీలక నిర్ణయం

ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్​ మధ్య జరిగే మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్.

Update: 2023-09-08 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్​ మధ్య జరిగే మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. సెప్టెంబర్​10న మ్యాచ్​జరగనుండగా.. తర్వాతి రోజును రిజర్వ్ డేగా ప్రకటించింది. అయితే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆటకు ఏదైనా ఆంటంకం ఏర్పడితే సెప్టెంబర్​11న ఆగిపోయిన సమయం నుంచి మ్యాచ్​జరగనుంది. అయితే, టోర్నీలోని ఇతర సూపర్​ ఫోర్​మ్యాచ్‌లకు మాత్రం ఎలాంటి రిజర్వ్ డేను ప్రటించలేదు. టోర్నీ ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉండగా.. తర్వాత భారత్, పాక్​మ్యాచ్‌కు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిచింది. ఒకవేళ మ్యాచ్​మధ్యలో ఆగిపోతే.. ప్రేక్షకలు తమ టికెట్లతో రిజర్వ్ డే మ్యాచ్‌కు రావొచ్చని చెప్పింది.

"ఆసియా కప్​సూపర్ ఫోర్‌లో భాగంగా జరిగే భారత్, పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ఏర్పాటు చేశాం. సెప్టెంబర్​10న శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఏదైనా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్​ఆగిపోతే ఆ సమయం నుంచి సెప్టెంబర్​ 11న తిరిగి మొదలవుతుంది" ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది.

గ్రూప్‌ దశలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాక్‌ మధ్య మ్యాచ్‌.. వర్షం కారణంగా రద్దు అయింది. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన సమయానికి జోరు వర్షం కురిసింది. ఆ తర్వాత చాలాసేపు వేచి చూసినప్పటికీ వర్షం తగ్గకపోవడం వల్ల చివరికి చేసేదేమి లేక పాక్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ మ్యాచ్‌ను చూద్దామనుకున్న వరల్డ్ క్రికెట్​ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది.


Similar News