దిశ, వెబ్డెస్క్: 24.2 ఓవర్ల దగ్గర ఇవాల్టి ఆట ప్రారంభించిన (147/2) టీమిండియా తొలుత కాస్త నిదానంగా ఆడినప్పటికీ, ఆ తర్వాత జోరు పెంచి వేగంగా పరుగులు రాబడుతుంది. ముఖ్యంగా రాహుల్ (42) గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లి (22) బాధ్యతగా ఆడుతున్నాడు. 34 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 204/2గా ఉంది.
వర్షం కారణంగా నిన్న రద్దైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన ఇవాళ ఎట్టకేలకు ప్రారంభమైంది. వరుణుడు శాంతించడంతో ఈ మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్గా సాగనుంది. నిన్న టీమిండియా ఎక్కడైతే ఇన్నింగ్స్ను ముగించిందో అక్కడి నుంచే ఇవాళ ప్రారంభిస్తుంది.