IRE vs IND: భారత్, ఐర్లాండ్ మూడో టీ20.. టాస్‌ ఆలస్యం..

Update: 2023-08-23 13:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌, భారత్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు చివరి టీ20 జరగనుంది. మూడో టీ20 మ్యాచ్ జరిగే 'ది విలేజ్‌' స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో టాస్ ఆలస్యంకానుంది.

క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను..

క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమ్‌ ఇండియా ఐర్లాండ్‌తో ఆఖరి పోరుకు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయంతో భారత్‌ ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం జట్టుకు సంతోషాన్నిచ్చే విషయం. మరోవైపు రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌ టీమ్‌ ఇండియాకు ఓ చక్కని అవకాశం.


Similar News