దిశ, వెబ్డెస్క్: మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దీంతో 6.5 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేశారు. అప్పటికి భారత్ స్కోరు 47/2. డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ రెండు పరుగుల ముందంజలో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (19), సంజు శాంసన్ (1) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఐర్లాండ్ బ్యాటర్లలో (51 నాటౌట్), కర్టిస్ క్యాంఫర్ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్ స్టిర్లింగ్ (11), లోక్కాన్ టక్కర్ (0), హ్యారీ టెక్టార్ (9), జార్జ్ డాక్రెల్ (1), మార్క్ అదైర్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఆఖర్లో.. ముఖ్యంగా అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో మెక్కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన మెక్కార్తీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.