దిశ, వెబ్డెస్క్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆసీస్, భారత్ మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్కు వర్షం అడ్డుగా వచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 35.4 ఓవర్ల సమయంలో మ్యాచ్ నిలిచిపోయింది. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్మిత్, లబుషేన్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 166/4. క్రీజ్లో జోష్ ఇగ్లిస్ (3*), కామెరూన్ గ్రీన్ (21*) ఉన్నారు. భారత బౌలర్లో.. షమీ 2, అశ్విన్ 1, జడేజా 1 వికెట్ తీశారు.