దిశ, వెబ్డెస్క్: ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (71 పరుగులు: 77 బంతుల్లో)ను ఆడమ్ జంపా (21.4వ ఓవర్) ఎల్బీ చేశాడు. దీంతో 142 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ను నష్టపోయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 22 ఓవర్లకు 143/1. క్రీజులో శ్రేయస్ అయ్యర్(3), గిల్ (72) రన్స్తో ఉన్నారు.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత్ ఎదుట ఆస్ట్రేలియా 277 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. షమీ 5/51 ప్రదర్శనతోపాటు బుమ్రా (1/43), అశ్విన్ (1/47), జడేజా (1/51) కట్టుదిట్టంగానే బౌలింగ్ వేశారు. అయితే, శార్దూల్ ఠాకూర్ (0/78) విఫలం కావడంతో ఆసీస్ భారీ స్కోరే చేయగలిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీ సాధించగా.. జోష్ ఇగ్లిస్ (45), స్టీవ్ స్మిత్ (41) లబుషేన్ (39), కామెరూన్ గ్రీన్ (31), మార్కస్ స్టొయినిస్ (29), ప్యాట్ కమిన్స్ (21*) విలువైన పరుగులు చేశారు.