IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్‌ హాఫ్ సెంచరీ.. భారత్‌ విజయం

Update: 2023-09-22 16:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది. 48.4 ఓవర్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ బ్యాటర్స్‌లో.. రుతురాజ్ (71), గిల్ (74), శ్రేయస్ (3), ఇషాన్ (18), సూర్య (50), కేఎల్ రాహుల్ (58) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్‌లో.. జంపా 2, పాట్ కమిన్స్, సీన్ అబాట్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత్‌ ఎదుట 277 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్‌ గెలిచిన ఇండియా బౌలింగ్‌ ఎంచుకుంది. షమీ 5/51 ప్రదర్శనతోపాటు బుమ్రా (1/43), అశ్విన్ (1/47), జడేజా (1/51) కట్టుదిట్టంగానే బౌలింగ్‌ వేశారు. అయితే, శార్దూల్ ఠాకూర్ (0/78) విఫలం కావడంతో ఆసీస్‌ భారీ స్కోరే చేయగలిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీ సాధించగా.. జోష్ ఇగ్లిస్ (45), స్టీవ్‌ స్మిత్ (41) లబుషేన్ (39), కామెరూన్ గ్రీన్ (31), మార్కస్ స్టొయినిస్ (29), ప్యాట్ కమిన్స్ (21*) విలువైన పరుగులు చేశారు.


Similar News