రోహిత్కు రిటైర్మెంట్ ప్రశ్న.. కీలక వ్యాఖ్యలు చేసిన భారత కెప్టెన్
రిటైర్మెంట్ వార్తలకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్స్టాఫ్ పెట్టాడు.
దిశ, స్పోర్ట్స్ : రిటైర్మెంట్ వార్తలకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్స్టాఫ్ పెట్టాడు. తాను ఇంకా ఆడాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఆదివారం డల్లాస్లో ఓ ఈవెంట్లో పాల్గొన్న రోహిత్ను రిటైర్మెంట్ గురించి అడిగారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ..‘ఒక్కటే చెబుతున్నా. నేను చాలా ఎక్కువ దూరం ఆలోచించే వ్యక్తిని కాదు. నేను కొంతకాలం ఆడటాన్ని మీరు చూస్తారు.’ అని తెలిపాడు. కాగా, టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో మిగతా ఫార్మాట్లకు కూడా అతను త్వరలోనే వీడ్కోలు పలుకుతాడని వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే ఏడాది జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు రోహితే కెప్టెన్గా ఉంటాడని బీసీసీఐ సెక్రెటరీ జై షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు, వచ్చే నెలలో శ్రీలంకతో వన్డే సిరీస్కు రోహిత్కు విశ్రాంతినివ్వనున్నట్టు తెలుస్తోంది.