దిశ, వెబ్డెస్క్: క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. టీమిండియా జట్టు మళ్లీ వన్డేల్లతో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకుంది. ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన గెలుపుతో టీమిండియా 116 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇక, 115 పాయింట్లు ఉన్న దాయాది దేశం పాకిస్థాన్ సెకండ్ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్లో చివరిదాకా పోరాడి ఓడిన ఆసీస్ మూడో స్థానంలో ఉంది. ఇక, టీమిండియా ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో నెంబర్-1 ప్లేస్లో ఉంది.. తాజాగా ఆసీస్పై విజయం సాధించడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే టీమిండియా టెస్టుల్లో (118 పాయింట్స్), టీ20ల్లో (264 పాయింట్స్)తో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన టీమ్గా నిలిచింది.
ఈరోజు మొహాలీ స్టేడియంలో ఉత్కంఠంగా సాగిన పోరులో రాహుల్ సేన ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతోచిత్తు చేసింది. ఆసీస్ నిర్ధేశించిన 277 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభ్మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 74 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్(77 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యారు కేవలం 3 పరుగులకే రనౌట్ అయి.. పెవిలియన్ బాట పట్టాడు. దీంతో బరిలోకి దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్( 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో58 పరుగులు నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ ( 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 50 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గెలుపును అందించారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
No. 1 Test team ☑️
— BCCI (@BCCI) September 22, 2023
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH