IND Vs ZIM : చివరి టీ20లో ఘన విజయం.. సిరీస్ భారత్ కైవసం
జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్డెస్క్: జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 167/6 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో జింబాబ్వే బ్యాటర్లు చేతులెత్తేశారు. 125 పరుగులకు జింబాబ్వే జట్టు ఆలౌట్ అయింది. అయితే ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (58), శివమ్ దూబే (26), రియాన్ పరాగ్ (22) రాణించారు. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్ 34 టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. శివమ్ దూబే 2 వికెట్లు పడగొట్టాడు.