IND VS PAK: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆట మొదలైంది

వర్షం కారణంగా నిన్న రద్దైన భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే అయిన ఇవాళ ఆట ప్రారంభమైంది.

Update: 2023-09-11 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: వర్షం కారణంగా నిన్న రద్దైన భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే అయిన ఇవాళ ఆట ప్రారంభమైంది. వరుణుడు ఆగిపోవడంతో ఈ మ్యాచ్‌ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా నిర్వహించనున్నారు. దాదాపు గంటన్నరకుపైగా ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, ఓవర్లలో ఎలాంటి కోత లేకుండా పూర్తిస్థాయి మ్యాచ్‌ జరగనుంది. నిన్న టీమిండియా ఎక్కడైతే ఇన్నింగ్స్‌ను ముగించిందో అక్కడి నుంచే ఇవాళ ప్రారంభిస్తుంది. నిన్న వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత్‌ స్కోర్‌ 24.1 ఓవర్లలో 147/2గా ఉండింది. రోహిత్‌ (56), గిల్‌ (58) హాఫ్ సెంచరీలు చేసి ఔట్‌ కాగా.. కోహ్లి (8), రాహుల్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు.


Similar News