వరల్డ్ చాంపియన్ జర్మనీకి షాకిచ్చిన భారత్
వరల్డ్ చాంపియన్ జర్మనీకి భారత పురుషుల హాకీ జట్టు షాకిచ్చింది.
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చాంపియన్ జర్మనీకి భారత పురుషుల హాకీ జట్టు షాకిచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా యూరోపా పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో జర్మనీపై 0-3 తేడాతో ఏకపక్షంగా గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదటి నుంచి భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చింది. చక్కటి డిఫెన్స్తో జర్మనీని నిలువరించింది. మరోవైపు, కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 16వ నిమిషంలో భారత్కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 41వ నిమిషంలో సుఖ్జీత్ సింగ్, 44వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ చెరో గోల్ చేశారు. మరోవైపు, జర్మనీకి కూడా చాలా అవకాశాలే దక్కాయి. కానీ, ఆ జట్టు గోల్ చేయడంలో విఫలమైంది. ఆదివారం గ్రేట్ బ్రిటన్తో భారత్ తలపడనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. నెదర్లాండ్స్, అర్జెంటీనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.