భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అప్‌డేట్.. మూడో టెస్టు మ్యాచ్ వేదిక మార్పు..?

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టెస్టు వేదికగా మారనుంది.

Update: 2023-02-12 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టెస్టు వేదికగా మారనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ధర్మశాల వేదికగా మార్చి 1న ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇటీవలే ధర్మశాల స్టేడియంలో భారీగా పనులు చేపట్టారు. ధ‌ర్మశాల స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో.. వేదికను మార్చాలని నిర్ణయించింది. అయితే మూడో టెస్టుకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుందనే విషయంలో బోర్డు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇండోర్, రాజ్‌కోట్, విశాఖపట్నం, ముంబై నగరాలు బీసీసీఐ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.

Also Read...

మయాంక్ డబుల్ సెంచరీ వృథా.. కర్ణాటకపై సౌరాష్ట్ర విక్టరీ 

Tags:    

Similar News