అదే చివరి సిరీస్ అని నా భార్యతో చెప్పా : Ravichandran Ashwin
టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడించకపోవడంపై చాలా గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడించకపోవడంపై చాలా గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్స్ టీమ్ ఇండియా మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. అశ్విన్ జట్టులో ఉంటే టీమిండియా గెలిచేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ విషయం వెల్లడించాడు.
గత డిసెంబరులోనే తన క్రికెట్ కెరీర్ ముగుస్తుందని అనుకున్నట్లు తెలిపాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ తర్వాత.. ఆసీస్ సిరీస్ తన కెరీర్లో చివరిదని భార్యకు కూడా చెప్పేశాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది విన్న ఫ్యాన్స్ షాకైపోయారు. అయితే అశ్విన్ అలా అనుకోవడానికి కారణం టీమిండియా మేనేజ్మెంట్ కాదు. అతని మోకాలి గాయమే.