రెజ్లర్ వినేష్ ఫొగాట్ కు రూ.4 కోట్ల నజరానా ప్రకటించిన హర్యానా
పారిస్ ఒలంపిక్స్ లో వినేష్ ఫొగాట్ అద్భుత ప్రదర్శనకు హర్యానా ప్రభుత్వం రూ.4 కోట్ల నజరానా ప్రకటించింది.
దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో వినేష్ ఫొగాట్ అద్భుత ప్రదర్శనకు హర్యానా ప్రభుత్వం రూ.4 కోట్ల నజరానా ప్రకటించింది. రెజ్లింగ్ లో ఫైనల్ వరకూ వెళ్ళి అనూహ్యంగా అనర్హత వేటు పడినప్పటికీ వినేష్ ను తాము ఛాంపియన్ గానే భావిస్తూ.. ఈ రివార్డ్ ఇస్తున్నామని తెలిపింది. కాగా తమ రాష్ట్ర క్రీడాకారులు ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే రూ.6 కోట్లు, వెండి పతకం సాధిస్తే రూ.4 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే 2.5 కోట్లు ఇస్తామని పోటీలకు ముందే హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే వినేష్ ఫైనల్ వరకు వెళ్ళినది దృష్టిలో ఉంచుకొని తను వెండి పతకం సాధించినట్టు భావిస్తున్నామని, అందుకుగాను రూ.4 కోట్ల రివార్డ్ ఇస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.