భారత మహిళా క్రికెటర్ల ర్యాంక్లు మెరుగు
మహిళల టీ20 ర్యాంకింగ్స్లో పలువురు భారత క్రీడాకారిణులు తమ ర్యాంక్లను మెరుగుపర్చుకున్నారు.
దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 ర్యాంకింగ్స్ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్లో పలువురు భారత క్రీడాకారిణులు తమ ర్యాంక్లను మెరుగుపర్చుకున్నారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో రాణించడంతో వారి స్థానాలు మెరుగయ్యాయి. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 3 స్థానాలు ఎగబాకి 12 ర్యాంక్కు చేరుకుంది. షెఫాలీ వర్మ 2 స్థానాలు అధిగమించి 21వ స్థానంలో నిలిచింది. భారత్ తరపున స్మృతి మంధాన టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. ఆమె 5వ స్థానాన్ని నిలబెట్టుకుంది.
బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ(3వ స్థానం), రేణుక సింగ్(10వ స్థానం) టాప్-10లో కొనసాగుతున్నారు. రాధా యాదవ్ 8 స్థానాలు, పూజ వస్త్రాకర్ 6 స్థానాలు అధిగమించి 15వ, 23వ ర్యాంక్లకు చేరారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో పూజ 8 వికెట్లు తీయగా.. రాధా 6 వికెట్లతో చెలరేగారు. ఆల్రౌండర్ విభాగంలో దీప్తి శర్మ మూడో ర్యాంక్కు దూసుకెళ్లింది. ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని టాప్-3కి చేరుకుంది.