ఆ మాట అని ఉంటే సెహ్వాగ్ బతికే వాడు కాదు.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరు ఉంటుంది.

Update: 2022-08-30 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరు ఉంటుంది. దాయాది దేశాలు తలపడుతున్నాయంటే క్రికెట్ ఆడే అన్ని దేశాల క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారంటే ఆతిశయోక్తి కాదు. అభిమానులే కాకుండా ఆటగాళ్లు కూడా భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో గ్రౌండ్‌లో కొన్నిసార్లు ఆటగాళ్లు దూకుడుగా ప్రవర్తిస్తారు. మ్యాచ్‌లో ఎలా ఉన్నప్పటికీ.. మ్యాచ్ ముగిసిన అనంతరం మాత్రం అందరు కలిసి పోతారు. అయితే, భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఓపెనర్ సెహ్వాగ్, సచిన్ గురించి షోయబ్ అక్తర్‌తో మాట్లాడుతూ.. "బాప్‌ బాప్‌ హోతా హై.. బేటా బేటా హోతా హై" అని అన్నాడని.. ఈ వార్త ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది.

ఈ విషయాన్ని స్వయంగా సెహ్వాగ్‌యే కొన్ని సందర్భాల్లో వెల్లడించాడు. అయితే, ఆసియా కప్‌ 2022లో భాగంగా భారత్, పాక్ మరోసారి తలపడటంతో అదే విషయాన్ని ఓ యాంకర్ అక్తర్‌ను ప్రశ్నించింది. దీంతో యాంకర్‌పై అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినా సెహ్వాగ్ తనతో ఎప్పుడు ఆ మాట అనలేదని.. ఒకవేళ అతడు నాతో ఆ మాట అని ఉంటే బతికే వాడు కాదని అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ సారి బంగ్లాదేశ్‌లో కలిసినప్పుడు కూడా సెహ్వాగ్‌ను ఈ విషయం గురించి ఆడిగానని.. అతడు కూడా తాను అలాంటి వ్యాఖ్యలు ఏమి చేయలేదని చెప్పాడని అక్తర్ అన్నాడు. అయిన మ్యా్చ్ గురించి కాకుండా ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎందుకు అని యాంకర్‌పై అక్తర్ ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.


Similar News