భారత హాకీ జట్లకు ఓటమి
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా యూరోప్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఓటమిని పొందింది.
దిశ, స్పోర్ట్స్ : ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా యూరోప్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఓటమిని పొందింది. శనివారం జర్మనీ చేతిలో 3-2 తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ చెరో గోల్ చేశారు. పెయిలట్ గొంజాలో రెండు గోల్స్తో జర్మనీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, మహిళల హాకీ జట్టు కూడా జర్మనీ చేతిలో 4-2 తేడాతో ఓడిపోయింది. మహిళల జట్టుకు ఇది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం.