Asian Games 2023: ఆసియా క్రీడల్లో మరో గోల్డ్.. స్క్వాష్ ఈవెంట్లో స్వర్ణం
దిశ, వెబ్డెస్క్: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల హవా కొనసాగుతోంది. తాజాగా స్క్వాష్ ఈవెంట్లో భారత్ గోల్డ్మెడల్ సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్లో దీపిక పల్లికల్–హరీందర్పాల్ జోడి 11-10, 11-10తో మలేషియా జంట మొహమ్మద్ కమల్, ఐఫా అజ్మాన్లను ఓడించింది. కాగా ఆసియా క్రీడల్లో స్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. అరంగేట్రంలోనే దీపిక పల్లికల్–హరీందర్ పాల్ ఛాంపియన్స్గా నిలిచారు. స్వాష్ డబుల్స్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 84(20 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. కాగా ఇది స్క్వాష్లో రెండవ స్వర్ణం కావడం విశేషం.
🥇𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐒𝐪𝐮𝐚𝐬𝐡 𝐑𝐞𝐢𝐠𝐧𝐬 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞!🌟
— SAI Media (@Media_SAI) October 5, 2023
Our dynamic mixed doubles team of @DipikaPallikal and @sandhu_harinder clinches GOLD, defeating Malaysia by a score of 2-0 in the final at #AsianGames2022!💥🥳
Join us in celebrating this golden achievement and sending… pic.twitter.com/d1GiaRVh4q