గ్రౌండ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

Update: 2023-03-28 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ -2023 16వ సీజన్ సందడి మొదలైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎస్‌కే కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తాజాగా చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో సీఎస్‌కే జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేశారు. క్రికెటర్ల ప్రాక్టీస్ చూసేందుకు భారీగా స్టేడియానికి క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. డ్రస్సింగ్ రూం నుంచి లెజండరీ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ గ్రౌండ్‌లోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. కాళ్లకు ఫ్యాడ్స్, చేతులకు గ్లౌజులు, తలకు హెల్మెంట్ ధరించి స్టైలిష్‌గా గ్రౌండ్‌లోకి ధోనీ ఎంట్రీ ఇచ్చాడు.

అప్పటి వరకు కొంచెం నిశబ్ధంగా అనిపించిన చెపాక్ స్టేడియం ఒక్కసారిగా ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది. ధోనీ గ్రౌండ్‌లో ఉన్నంతసేపు ధోనీ, ధోనీ అనే నామస్మరణతో అభిమానులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సీఎస్‌కే ఫ్రాంచైజీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మార్చి 31 న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Tags:    

Similar News