దిశ, వెబ్డెస్క్: రిలయన్స్ రిటైల్స్కు చెందిన ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ జియోమార్ట్ (JioMart)కు భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ మేరకు జియోమార్ట్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కాగా, జియోమార్ట్లో భాగమైనందుకు ధోనీ సంతోషం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు షాపింగ్ జర్నీలో భాగం కావాలని పిలుపునిచ్చారు.