CPL 2023: సీపీఎల్ నుంచి రాయుడు ఔట్!

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.

Update: 2023-08-31 16:14 GMT

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. సీపీఎల్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన అతను.. వరుసగా 0, 32, 15 పరుగులు చేశాడు.

అయితే, సీపీఎల్ నుంచి అతను తప్పుకోవడానికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో అతను టోర్నీ మధ్యలోనే నిష్ర్కమించినట్టు తెలుస్తోంది. దీనిపై రాయుడుగానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌గానీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. కాగా, ప్రవీణ్ తాంబే తర్వాత సీపీఎల్‌ ఆడుతున్న రెండో భారత క్రికెటర్‌గా రాయుడు నిలిచాడు.


Similar News