ప్రధాని మోడీ భుజంపై చెయ్యి వేసిన బుమ్రా కొడుకు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్..!

టీ-20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు స్వదేశంలో గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఐసీసీ ట్రోఫితో

Update: 2024-07-05 14:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు స్వదేశంలో గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఐసీసీ ట్రోఫితో భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ప్లేయర్లకు అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా, టీ-20 వరల్డ్ కప్‌ టోర్నీలో భారత్‌ను విశ్వ విజేతగా నిలిపిన టీమిండియా ఆటగాళ్లను ప్రధాని మోడీ సైతం ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ విన్నింగ్‌ టీమ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో మోడీ అల్ఫాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ సైతం హాజరయ్యారు. భారత్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బౌలర్ బుమ్రా ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరైంది.

బుమ్రా సతీమణి సంజనా గణేశన్ కొడుకుతో పాటు హాజరై ఈ ప్రోగామ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా బుమ్రా తన భార్య, కొడుకుతో కలిసి ప్రధాని మోడీతో గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోలో బుమ్రా కొడుకును ప్రధాని మోడీ ఎత్తుకోగా.. బుడ్డోడు ఏకంగా మోడీ భుజంపై చేయి వేసి ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు. మోడీ షోల్డర్‌పై బుమ్రా కొడుకు చేయి వేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘‘బుమ్రా కొడుకు గ్రేట్.. ఏకంగా దేశ ప్రధాని భుజంపైనే చేయి వేసి ఫొటో దిగాడు’’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, భారత్ టీ-20 వరల్డ్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన బుమ్రా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

 


Similar News