అండర్-20 వరల్డ్ చాంపియన్షిప్లో యువ రెజ్లర్ భువనేశ్కు కాంస్యం
స్పెయిన్లో జరిగిన అండర్-20 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది.
దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్లో జరిగిన అండర్-20 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు యువ రెజ్లర్ భువనేశ్ కాంస్య పతకం సాధించాడు. పురుషుల ప్రీస్టైల్ 61 కేజీల కేటగిరీలో మెడల్ గెలుచుకున్నాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో భువనేశ్ 6-5 తేడాతో కజకిస్తాన్ రెజ్లర్ నుర్లాన్బెక్ను చిత్తు చేశాడు. దీంతో భారత్ ఈ టోర్నీ 7 పతకాలతో ముగించింది. అందులో ఓ స్వర్ణం, ఓ రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ టోర్నీలో పురుషులతో పోలిస్తే మహిళా రెజ్లర్లు సత్తాచాటారు. మహిళా ప్రీస్టైల్ రెజ్లర్లు ఐదు పతకాలతో టోర్నీలో రెండో స్థానంలో నిలిచారు. పురుషుల కేటగిరీలో కేవలం రెండే పతకాలు దక్కాయి.