Asia Cup 2023: విరాట్‌ కోహ్లిపై బీసీసీఐ సీరియస్‌.. ఎందుకంటే?

విరాట్‌ కోహ్లి ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రెయినింగ్‌ క్యాంపులో తీవ్రంగా శమ్రిస్తున్నాడు.

Update: 2023-08-25 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: విరాట్‌ కోహ్లి ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రెయినింగ్‌ క్యాంపులో తీవ్రంగా శమ్రిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలూరులో నిర్వహించిన యో-యో టెస్టును కూడా విరాట్‌ క్లియర్‌ చేశాడు. అయితే యో​-యో టెస్టులో పాసయ్యానని, 17.2 స్కోర్‌ సాధించినట్లు సోషల్‌ మీడియా వేదికగా కోహ్లి వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్‌ చేయవద్దని కోహ్లికి బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. కోహ్లి యో​-యో టెస్టుకు సంబంధించిన స్కోర్‌ను పోస్ట్‌ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు ఏ మాత్రం నచ్చలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోసారి ఇలా అలా చేయొద్దంటూ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Similar News