BCCI Announces India's Squad For 2nd Test: బంగ్లాతో రెండో టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ

టీమిండియా(Team India) చెన్నై(Chennai) టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై.. 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Update: 2024-09-22 08:32 GMT

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా(Team India) చెన్నై(Chennai) టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై.. 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో బంగ్లాపై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 న కాన్పూర్ వేదికగా జరగనుంది. అయితే ఈ రెండో టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ(BCCI) భారత జట్టును ప్రకటించింది.జట్టులో కేఎల్ రాహుల్ స్థానం గురించి చర్చలు జరిగాయి.ముఖ్యంగా చెపాక్‌లో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో రాహుల్ తక్కువ స్కోర్ తో వెనుదిరగడంతో జట్టులో మార్పులపై చర్చలు జరిగినప్పటికీ..ఫైనల్ గా సెలక్షన్ కమిటీ రెండో టెస్టుకు కూడా అదే స్క్వాడ్ ను కొనసాగిస్తూ జట్టును ప్రకటించింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు.

రెండో టెస్టుకు టీమిండియా స్క్వాడ్:

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్


Similar News