నవంబర్‌లో సౌతాఫ్రికాకు టీమ్ ఇండియా.. టీ20 సిరీస్ షెడ్యూల్ రిలీజ్

టీమ్ ఇండియా సౌతాఫ్రికా పర్యటన ఖరారైంది. నవంబర్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.

Update: 2024-06-21 12:10 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సౌతాఫ్రికా పర్యటన ఖరారైంది. నవంబర్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా శుక్రవారం రిలీజ్ చేశాయి. నవంబర్ 8న డర్బన్ వేదికగా జరిగే తొలి టీ20తో సిరీస్ ప్రారంభంకానుంది. నవంబర్ 10న రెండో మ్యాచ్ గ్కెబెర్హా వేదికగా జరగనుండగా.. 13, 16 తేదీల్లో జరిగే మిగతా రెండు మ్యాచ్‌లకు సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ ఆతిథ్యమివ్వనున్నాయి. కాగా, భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించడం వరుసగా ఇది రెండో ఏడాది. గతేడాది డిసెంబర్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఆ టూరులో టీ20 సిరీస్‌ను ఇరు జట్లు 1-1తో పంచుకున్నాయి. 


Similar News