Asian Games 2023 Womens Cricket: పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో టీమిండియాతో 'ఢీ'

ఏషియన్‌ గేమ్స్‌ 2023 వుమెన్స్‌ క్రికెట్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరింది.

Update: 2023-09-24 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏషియన్‌ గేమ్స్‌ 2023 వుమెన్స్‌ క్రికెట్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఇవాళ జరిగిన సెకెండ్‌ సెమీఫైనల్లో లంకేయులు పాక్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టనున్న శ్రీలంక..

రెండో సెమీస్‌లో పాక్‌పై గెలుపుతో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. గోల్డ్‌ మెడల్‌ కోసం జరిగే తుది సమరంలో లంకేయులు టీమిండియాను ఢీకొట్టనున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 11:30 గంటలకు మొదలవుతుంది. కాగా, ఇవాలే జరిగిన తొలి సెమీస్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది.


Similar News