ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం

చైనా వేదికగా ఆదివారం ప్రారంభమైన హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది.

Update: 2024-09-08 12:59 GMT

దిశ, స్పోర్ట్స్ : చైనా వేదికగా ఆదివారం ప్రారంభమైన హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. టోర్నీ చరిత్రలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనాను 3-0 తేడాతో చిత్తు చేసి టోర్నీలో సూపర్ బోణీ చేసింది. మ్యాచ్‌లో మొదటి నుంచి చివరి వరకూ భారత్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. 14వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 27వ నిమిషంలో ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఫస్టాఫ్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇక, మూడో క్వార్టర్‌లో అభిషేక్ చేసిన గోల్‌ చేయడంతో 3-0తో మ్యాచ్‌‌ను పూర్తిగా చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత భారత్ పెనాల్టీ కార్నర్లను భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అదే సమయంలో చైనా చేసిన గోల్ ప్రయత్నాలను తిప్పికొట్టింది. దీంతో చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయతీరాలకు చేరింది. సోమవారం రెండో గ్రూపు మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.

Tags:    

Similar News