Asia Cup 2023 : సూపర్-4లో భారత్-పాక్ మ్యాచ్.. ఫ్యాన్స్కు గుడ్న్యూస్
ఆసియా కప్ 2023 గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: ఆసియా కప్ 2023 గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ మ్యాచ్ను చూద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్కు తీవ్ర నిరాశే ఎదురైంది. అందరూ డీలా పడిపోయారు. ఆసియా కప్లో సూపర్-4 మ్యాచ్లు జరిగే కొలంబోలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే సూపర్-4లో ఈ రెండు జట్లు మరో సారి పోటీపడనుండటం వల్ల మ్యాచ్పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక వాతావరణశాఖ అధికారి ఒకరు అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని తెలిపారు.
టోర్నీ ముగింపు దశ మ్యాచ్లకు అంతగా వర్షం ముప్పు ఉండదని శ్రీలంక వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కరుణా నాయక్ తెలిపారు. సెప్టెంబరు 9 తర్వాత కొలంబోలో వాతావరణం పొడిగా ఉంటుందని అన్నారు. ఒక వేళ వర్షం పడినా.. కేవలం చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో సెప్టెంబరు 10న టీమ్ ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సజావుగా సాగే ఛాన్స్ ఉంది.