Asia Cup 2023: కోహ్లీ ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్.. (వీడియో)

Update: 2023-09-04 14:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్‌-నేపాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి వివాదంలో చిక్కకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ చూపించాడు. మ్యాచ్‌ మధ్యలో కోహ్లి ఫ్యాన్స్.. భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను ఆటపట్టించే ప్రయత్నం చేయగా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సమయంలో (38వ ఓవర్‌) గంభీర్‌ మైదానంలో నుంచి కామెంట్రీ బాక్స్‌ వైపు వెళ్తుండగా కొందరు అభిమానులు కోహ్లి, కోహ్లి.. అంటూ కేకలు వేశారు. దీంతో కోపంతో గంభీర్‌.. కోహ్లి ఫ్యాన్స్‌కు మధ్య వేలును చూపించి, వారి తిక్క కుదిర్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ఆసియాకప్ 2023 టోర్నీకి గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారత్-నేపాల్ మ్యాచ్‌‌కు వర్షం కారణంగా అంతరాయం కలిగింది. మ్యాచ్ ఆగిపోయిన సమయంలో మైదానంలోకి వెళ్లిన గంభీర్.. మైదాన పరిస్థితులని వివరించి తిరుగు ముఖం పట్టే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్‌తో రద్దయిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔటైన తీరును గంభీర్ తప్పుబట్టాడు. చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడని విమర్శించాడు. ఈ కామెంట్స్ నేపథ్యంలోనే గంభీర్ కనిపించగానే అభిమానులు కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా కూడా ఈ ఇద్దరి మధ్య మైదానంలోనే గొడవ జరిగిన విషయం తెలిసిందే.


Similar News