Asia Cup 2023: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా..

ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Update: 2023-09-12 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 20 ఏళ్ల యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే.. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లను తన స్పిన్ మ్యాజిక్‌తో పెవిలియన్ చేర్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించగా.. తొలి వికెట్‌కి 80 పరుగులు జోడించారు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 3 పరుగులు చేసి, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లోనే దసున్ శనకకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

మరో ఎండ్‌లో 44 బంతుల్లో వన్డేల్లో 51వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు రోహిత్ శర్మ. 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దునిత్ వెల్లలాగే ఓ మెయిడిన్‌తో 4 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.


Similar News