సెమీస్ లో ఓడిన అమన్.. రేపు కాంస్యం కోసం పోరాటం

పారిస్ ఒలంపిక్ భారత రెజ్లర్ అమన్ సెమీస్ ఫైనల్ ఓడిపోయాడు.

Update: 2024-08-08 17:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్ భారత రెజ్లర్ అమన్ సెమీస్ ఫైనల్ ఓడిపోయాడు. శుక్రవారం కాంస్య పతకం కోసం జరిగే పోటీలో పాల్గొననున్నాడు. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో జపాన్ కు చెందిన హిగుచి చేతిలో పరాజయం పొందాడు. ఒక్క పాయింట్ కూడ సాధించకుండా అమన్ ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ బౌట్ కేవలం నాలుగు నిముషాల్లోనే ముగిసింది. ఇక రేపు జరిగే కాంస్య పతక రేసులో ప్యూర్టోరికోకు చెందిన డారియన్ క్రజ్ తో తలపడనున్నాడు.   


Similar News