Hyderabad: ఆలిండియా బుచ్చిబాబు టోర్నమెంట్‌లో హైద‌రాబాద్ ఘనవిజయం

ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేష‌న్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ఏడేళ్ల త‌ర్వాత తొలిసారిగా ట్రోఫీ గెలుపొందింది

Update: 2024-09-11 15:02 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేష‌న్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ఏడేళ్ల త‌ర్వాత తొలిసారిగా ట్రోఫీ గెలుపొందింది. బుధ‌వారం త‌మిళ‌నాడులోని దిండిగ‌ల్‌లో ఛత్తీస్‌గ‌ఢ్‌తో ముగిసిన ఫైన‌ల్ మ్యాచులో హైద‌రాబాద్ జ‌ట్టు 243 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత హైద‌రాబాద్ జ‌ట్టు ఈ ట్రోఫీని కైవసం చేసుకోవడంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, కార్యద‌ర్శి దేవ్‌రాజ్‌ హ‌ర్షం వ్యక్తం చేశారు. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి రాష్ట్రానికి ట్రోఫీ అందించినందుకు జ‌ట్టులోని సభ్యులను అభినందించారు. ఫైన‌ల్లో చెల‌రేగి, హైద‌రాబాద్ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించిన సెంచ‌రీ హీరో రోహిత్ రాయుడు (155 తొలి ఇన్నింగ్స్‌), హాఫ్ సెంచ‌రీల‌తో అల‌రించిన‌ అభిర‌థ్ రెడ్డి, కెప్టెన్ రాహుల్ సింగ్‌, బౌలింగ్‌లో చెల‌రేగిన త‌న‌య్ త్యాగ‌రాజ్‌, అనికేత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటగాళ్లు హైద‌రాబాద్ చేరుకున్నాక జ‌ట్టు స‌భ్యుల‌ను ఘ‌నంగా స‌త్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జ‌గ‌న్‌మోహ‌న్ రావు తెలిపారు.


Similar News