సార్ మీరు రావాల్సిందే.. రేవంత్ రెడ్డి ఆహ్వానం

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ జాతీయ నేత రాహుల్​గాంధీతో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన రేవంత్​రెడ్డి.. ఈ నెల 17న రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్​లో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు రావాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చేందుకు రాహుల్​ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17న దళిత దండోరా ఆఖరి సభ నిర్వహిస్తున్న […]

Update: 2021-09-08 05:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ జాతీయ నేత రాహుల్​గాంధీతో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన రేవంత్​రెడ్డి.. ఈ నెల 17న రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్​లో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు రావాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చేందుకు రాహుల్​ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17న దళిత దండోరా ఆఖరి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సభకు రావాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా రాహుల్​కు వివరించారు.

కాగా, ఈ నెల 17న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా వస్తున్న నేపథ్యంలో రాహుల్‌ను కూడా రావాలని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గజ్వేల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించేందుకు రేవంత్​రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

Tags:    

Similar News