కళ్లు మూసుకొని దోశ వేసిన మెగాస్టార్

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్ సూపర్ ఎంటర్‌టైన్మెంట్‌తో సక్సెస్‌ఫుల్‌గా కొసాగుతోంది. ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ తనదైన స్టైల్‌లో నవ్వుల పువ్వులు పూయిస్తున్న సమంత అక్కినేని.. క్రిస్మస్ కానుకగా మెగాస్టార్ చిరంజీవిని స్పెషల్ గెస్ట్‌గా తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. ట్రెండింగ్‌లో ఉంచారు మెగా ఫ్యాన్స్. సామ్ అల్లరికి తన అల్లరి జోడిస్తూ ఎప్పటిలాగే సూపర్ ఫన్ అందించిన చిరు ‘మెగా దోశ చాలెంజ్’ ప్రోమోలో హైలెట్‌గా […]

Update: 2020-12-22 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్ సూపర్ ఎంటర్‌టైన్మెంట్‌తో సక్సెస్‌ఫుల్‌గా కొసాగుతోంది. ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ తనదైన స్టైల్‌లో నవ్వుల పువ్వులు పూయిస్తున్న సమంత అక్కినేని.. క్రిస్మస్ కానుకగా మెగాస్టార్ చిరంజీవిని స్పెషల్ గెస్ట్‌గా తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. ట్రెండింగ్‌లో ఉంచారు మెగా ఫ్యాన్స్. సామ్ అల్లరికి తన అల్లరి జోడిస్తూ ఎప్పటిలాగే సూపర్ ఫన్ అందించిన చిరు ‘మెగా దోశ చాలెంజ్’ ప్రోమోలో హైలెట్‌గా నిలిచింది. ‘దోశ ఎవరైనా వేయగలరు.. ఎవరైనా ఫ్లిప్ చేయగలరు.. కానీ కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లిప్ చేసేవారికే ఓ రేంజ్ ఉంటుంది అంటూ’ దోశ చాలెంజ్ పూర్తి చేశాడు చిరు.

https://twitter.com/ahavideoIN/status/1341242059680665600?s=20

ఫ్రిజ్‌లో ఎప్పుడు ఉండే ఐటెం ఏంటి? సినిమా చూస్తూ ఎప్పుడైనా ఏడ్చేసారా? లాంటి ‘సామ్ జామ్’ ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చిన చిరు.. చిన్నారి అభిమానిని కలవడం ఆనందంగా ఉందని చెప్పారు.

Tags:    

Similar News