మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.76 ఉండగా డీజిల్ ధర రూ.85.66 ఉంది. ఇక వాణిజ్య నగరమైన ముంబాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 ఉండగా డీజిల్ […]

Update: 2021-06-03 23:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.76 ఉండగా డీజిల్ ధర రూ.85.66 ఉంది. ఇక వాణిజ్య నగరమైన ముంబాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 ఉండగా డీజిల్ ధర రూ. 93.09 గా ఉంది. అలానే కొల్ కత్తాలో పెట్రోలు డీజిల్ ధరలు 94.76, రూ. 88.51గా ఉంది. ఇక తెలుగురాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.98.48 ఉండగా డీజిల్ ధర రూ.93.38గా ఉంది. అలానే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.100. 89 ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 95.15గా ఉంది.

Tags:    

Similar News