వలస కూలీలకు ఎమ్మెల్యే బియ్యం పంపిణీ

దిశ, మహబూబ్ నగర్: వలస కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాగనూర్ మండలంలో అమలు చేశారు. రామాంజనేయులు ఇటుక బట్టి దగ్గర ఉన్న వలస కార్మికులకు 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, రూ.500 అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారైనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, […]

Update: 2020-03-31 08:20 GMT

దిశ, మహబూబ్ నగర్: వలస కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాగనూర్ మండలంలో అమలు చేశారు. రామాంజనేయులు ఇటుక బట్టి దగ్గర ఉన్న వలస కార్మికులకు 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, రూ.500 అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారైనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో సుధాకర్, జడ్పీటీసీ వెంకటయ్య, మాగనూర్ ఎంపీపీ శామలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags: rice distribution, maganur, migrant labourers, MLA ram mohan reddy, TRS

Tags:    

Similar News