ఓటీటీ వైపు జక్కన్న అడుగులు..

దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తం చేశాడు. జక్కన్న సినిమా చేస్తే పక్కా హిట్.. అన్న విషయం పక్కనబెడితే, ఎక్కువ టైమ్ తీసుకుంటాడనే టాక్ ఉంది. అయితే దర్శకులందరూ ట్రెండ్‌కు తగినట్లుగా ఓటీటీ కంటెంట్‌తో ముందుకొస్తుండగా.. జక్కన్న కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపు అడుగులేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే వెల్లడించాడు. ఇప్పటికే హిందీ డైరెక్టర్లతో పాటు తెలుగులో క్రిష్, పూరీ జగన్నాధ్, వంశీ […]

Update: 2020-07-11 03:49 GMT

దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తం చేశాడు. జక్కన్న సినిమా చేస్తే పక్కా హిట్.. అన్న విషయం పక్కనబెడితే, ఎక్కువ టైమ్ తీసుకుంటాడనే టాక్ ఉంది. అయితే దర్శకులందరూ ట్రెండ్‌కు తగినట్లుగా ఓటీటీ కంటెంట్‌తో ముందుకొస్తుండగా.. జక్కన్న కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపు అడుగులేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే వెల్లడించాడు.

ఇప్పటికే హిందీ డైరెక్టర్లతో పాటు తెలుగులో క్రిష్, పూరీ జగన్నాధ్, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు ఓటీటీ కంటెంట్‌పై కాన్సంట్రేట్ చేశారు. వీరి బాటలోనే రాజమౌళి కూడా నడుస్తాడని తెలుస్తోంది. అయితే నిర్మాతగానా? లేక డైరెక్టర్ గానా? అనేది మాత్రం సస్పెన్స్.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బిజీగా ఉన్న జక్కన్న.. నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడని సమాచారం. అలా అయితే రాజమౌళి ఓటీటీకి నిర్మాతగానే ఎంట్రీ ఇస్తారంటున్నారు కొందరు.

Tags:    

Similar News