ఆర్ఎస్ఎస్‌ మార్చ్‌కు నో పర్మిషన్‌.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

ఆర్ఎస్ఎస్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బిగ్ షాకిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించదలిచిన మార్చ్‌

Update: 2022-10-01 04:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఎస్ఎస్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బిగ్ షాకిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించదలిచిన మార్చ్‌కు అనుమతి లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ ప్రదర్శనల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అందువల్ల పర్మిషన్ నిరాకరిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా, అక్టోబర్ 2వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 50 చోట్ల మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై విధించిన నిషేధం నేపథ్యంలో ఇటీవల తలెత్తిన పరిణామాల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా జరుగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News