Breaking: క్యాబినెట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం..

క్యాబినేట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.

Update: 2024-06-09 14:55 GMT

దిశ వెబ్ డెస్క: క్యాబినేట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ‘భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకుంటానని, మంత్రిగా దేశ రక్షణ రహస్యాలను పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గాని ఎరికి చెప్పనని, నిజాయితీగా, స్పృహతో నా బాధ్యతలను నెరవేరుస్తానని, క్యాబినేట్ మంత్రిగా రాజ్యాగాన్ని అనుసరించి నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవచేస్తానని దేవునిపై ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రమాణం చేశారు. 

టీడీపీ తరుపున శ్రీకాకుళం నుండి కుంజరాపు రామ్ మోహన్ నాయుడు భారీ మొజారిటీతో ఎంపీగా గెలుపొందారు. కాగా నేడు రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము సమక్షంలో క్యాబినేట్ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.


Similar News