Nara Lokesh : జగన్.. రాష్ట్రం నీ తాత జాగీరా.. ట్వట్టర్‌లో మంత్రి నారా లోకేష్ ఫైర్

ప్రతి పార్టీ అధికారుల అనుమతితో జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడం సహజం.

Update: 2024-06-23 09:13 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రతి పార్టీ అధికారుల అనుమతితో జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడం సహజం. అయితే ఈ తరహాలోనే వైసీపీ సైతం జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పూనుకుంది. అయితే అన్ని పార్టీల మాదిరి చిన్నా చితకా కార్యాలయాలను నిర్మించ లేదు. వందల కోట్లను వ్యచించి నిబంధనలకు విరుద్దంగా, అనుమతులు తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజభవనాలను తలపించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాలను నిర్మించారనే వార్తలు ప్రస్తుతం అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చక్కెర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలోని అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అనుమతులకు విరుధ్దంగా కట్టిన వైసీపీ కర్యాలయాల్లో కొన్నింటిని కూల్చేయగా, మరికొన్నింటికి నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పంధించారు. ‘జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు.

జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’ అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.


Similar News