Nara Lokesh: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ విషయంలో మంత్రి నారా లోకేష్ భరోసా..

మంత్రి నారా లోకేష్ తాను నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌పై నేడు ట్విట్టర్ వేదికగా స్పంధించారు.

Update: 2024-07-09 11:49 GMT

దిశ వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేష్ తాను నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌పై నేడు ట్విట్టర్ వేదికగా స్పంధించారు.నాడు పరదాల ప్రభుత్వం, నేడు ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు. అలానే మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రారంభించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. 14వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని వెల్లడించారు.

గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశానని అన్నారు.

మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారని.. అలానే ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని, అర్హత పత్రాలు మంజూరు చేయాలని, ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. కాగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చినట్టు తెలిపారు. 


Similar News