Attack on YS Jagan: పులివెందులలో కలకలం.. మాజీ సీఎం జగన్‌పై దాడికి యత్నం..

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు.

Update: 2024-07-07 10:08 GMT

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా 2019 ఎన్నికల్లో 151 స్థానాలను సాధించిన పార్టీ, 2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూడడానికి గల కారణాలపై జగన్ ఆరా తీస్తున్నారు. అలానే ప్రజా దర్భార్‌ను ఏర్పాటు చేసి ప్రజలను స్వయంగా కలిసి మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌ను కలవడానికి వచ్చిన ఓ అభిమాని జగన్‌పై దాడికి ప్రయత్నించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘నీ వల్లే మా వైఎస్ఆర్ కి చెడ్డ పేరు అంటూ.... పులివెందులలో జగన్‌ని కొట్టటానికి వెళ్ళిన వైఎస్ఆర్ అభిమాని’ అనే ట్యాగ్‌ను సైతం ఆ వీడియోకి జోడించారు. కాగా ఆ వీడియోలో జగన్ అభివాధం చేస్తుంటారు. ఇంతలో ఓ వ్యక్తి జగన్‌ దగ్గరకి దురుసుగా వస్తారు.

ఇంతలో బౌన్సర్లు అతన్ని పట్టుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి జగన్‌పై అభిమానంతో కౌగిలించుకోవడానికి వస్తున్నారని కొందరు, జగన్‌ను కొట్టడానికే వస్తున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


Similar News