ఏపీని తాకట్టు పెట్టిన జగన్.. పవన్ సంచలన ఆరోపణలు

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం తప్పుడు ఆర్ధిక లెక్కలతో ప్రజలను మాయ చేస్తోందని ఆరోపించారు. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ టైటిల్‌తో ట్వీట్ చేసిన ఆయన..‘ ఎన్ని వాగ్ధానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్‌ను ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు.. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌళిక ఆర్ధిక సూత్రాన్ని వైసీపీ […]

Update: 2021-10-08 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం తప్పుడు ఆర్ధిక లెక్కలతో ప్రజలను మాయ చేస్తోందని ఆరోపించారు. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ టైటిల్‌తో ట్వీట్ చేసిన ఆయన..‘ ఎన్ని వాగ్ధానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్‌ను ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు.. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌళిక ఆర్ధిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది’ అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అప్పుల పాలు చేస్తున్నారని విరుచుకుపడ్డ పవన్.. ఏపీ ఎలా తాకట్టుపెట్టబడిందనే విషయం సామాన్యులకు అర్థమయ్యేలా చార్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇమేజ్ పోస్ట్ చేశాడు.

 

 

 

Tags:    

Similar News