కరోనాతో ప్రవాస భారతీయుడు మృతి

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల మైలారం తండాకు చెందిన బానోతు ప్రేమ్ లాల్(30) కరోనా బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. తన సోదరుడి పెళ్లి మే 6వ తేదీన ఉండటంతో అమెరికా నుండి వచ్చినట్లు బంధువులు తెలిపారు. గత వారం రోజుల కిందట కరోనా పాజిటివ్ రాగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుని తల్లిదండ్రులకు కూడా కొవిడ్ పాజిటివ్ రావడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఇదే […]

Update: 2021-04-29 11:34 GMT

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల మైలారం తండాకు చెందిన బానోతు ప్రేమ్ లాల్(30) కరోనా బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. తన సోదరుడి పెళ్లి మే 6వ తేదీన ఉండటంతో అమెరికా నుండి వచ్చినట్లు బంధువులు తెలిపారు.

గత వారం రోజుల కిందట కరోనా పాజిటివ్ రాగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుని తల్లిదండ్రులకు కూడా కొవిడ్ పాజిటివ్ రావడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఇదే తండాలో 15 మందికి పైగా కరోనా పాజిటివ్ రావడంతో తండా వాసులు భయందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News