బిగ్ బ్రేకింగ్ : రాజస్థాన్‌లో మరో 9 ఒమిక్రాన్ కేసులు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఒమిక్రాన్ కొత్త కరోనా వేరియంట్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 4 లోపు ఉన్న ఈ కేసులు ఒక్కసారిగా  భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే రాజస్థాన్‌లోని జయపురలో 9 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నవంబర్ 25న దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు చేరుకున్నారు. వారిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా పాజిటివ్ అని తేలింది. […]

Update: 2021-12-05 09:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఒమిక్రాన్ కొత్త కరోనా వేరియంట్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 4 లోపు ఉన్న ఈ కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే రాజస్థాన్‌లోని జయపురలో 9 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నవంబర్ 25న దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు చేరుకున్నారు.

వారిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా పాజిటివ్ అని తేలింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు తేలింది. పాజిటివ్ వచ్చిన వారితో చనువుగా ఉన్న మరో ఐదుగురికి కూడా ఈ వైరస్ సోకింది. కాగా, ఈరోజే మహారాష్ట్రలో కూడా కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇవాళ ఒక్కరేజే 17 కేసులు నమోదవ్వగా, తాజా కేసులు కలుపుకుని ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కు చేరింది.

Tags:    

Similar News