ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,886 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,46,245 కి చేరుకుంది. ఇందులో 20,958 యాక్టివ్ కేసులుండగా 8,18,473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 2,151 మంది డిశ్చార్జి అయ్యారు. […]

Update: 2020-11-10 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,886 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,46,245 కి చేరుకుంది. ఇందులో 20,958 యాక్టివ్ కేసులుండగా 8,18,473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 2,151 మంది డిశ్చార్జి అయ్యారు. అంతేగాకుండా కొత్తగా కరోనా బారినపడి 12 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,802కు పెరిగింది. జిల్లాల వారిగా చూస్తే… చిత్తూరులో 291, ఈస్ట్ గోదావరిలో 227, గుంటూరులో 275, కృష్ణాలో 269, వెస్ట్ గోదావరి 282 అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.

Tags:    

Similar News