Bengaluru : యువతిని 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో పెట్టారు

దిశ, నేషనల్ బ్యూరో : ఒక ఘోర ఘటనతో బెంగళూరు నగరం ఉలిక్కిపడింది.

Update: 2024-09-21 15:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఒక ఘోర ఘటనతో బెంగళూరు నగరం ఉలిక్కిపడింది. వ్యాలీ కవల్ ఏరియాలోని ఒక అపార్ట్‌మెంటులో ఉన్న సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల యువతిని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టారు. ఆ ఫ్లాట్ నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వచ్చి ఆ ఫ్లాట్‌లో తనిఖీ చేసి.. ఓ యువతిని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు గుర్తించారు.

శరీర భాగాలు చాలారోజులుగా ఫ్రిజ్‌లో ఉండటంతో కుళ్లిపోయాయని వెల్లడైంది. మృతురాలి వివరాలను గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మరో రాష్ట్రానికి చెందిన సదరు యువతి.. ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివసిస్తోందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. ఫింగర్ ప్రింట్స్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు అక్కడికి చేరుకొని క్లూస్‌ను సేకరించారు. దర్యాప్తు పూర్తయితేనే వివరాలన్నీ తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేశారు.


Similar News