రిపోర్టర్స్ వరుస ప్రశ్నలతో... మను భాకర్ అసహనం

పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత యువ షూటర్ మను భాకర్.. ఇటీవలే దేశవ్యాప్త పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-22 05:46 GMT

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత యువ షూటర్ మను భాకర్.. ఇటీవలే దేశవ్యాప్త పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మను భాకర్ తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటిస్తూ.. అక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలతో భాకర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ అంశాలపై మాట్లాడుతూ.. క్రీడలను కెరీర్ గా ఎంచుకోవాలని తెలిపారు. తదనంతరం రిపోర్టర్లు నీరజ్ చోప్రా గురించి ఆమెను అడిగారు. జర్మనీలో మీరిద్దరూ సంభాషించుకున్న ఫోటోలు, మీ అమ్మ కూడా నీరజ్ చోప్రాతో మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని, దీనిపై మీ సమాధానం ఏంటి? అని విలేకరులు మనుని అడగగా.. దాంతో ఆమె సమాధానం ఇవ్వకుండా, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News